కావలసిన పదార్థాలు:
మొలకెత్తిన రాగులు - 4 కప్పులు, మినప్పప్పు - 1 కప్పు, ఉప్పు - రుచికి
సరిపడా, ఉల్లిపాయలు - 5, క్యారెట్లు - 3, నూనె - కాల్చడానికి తగినంత.
తయారుచేసే విధానం: మినప్పప్పుని గంట నానబెట్టాలి. రాగి మొలకల్ని, మినప్పప్పుని విడివిడిగా చిక్కగా రుబ్బుకుని ఆ తర్వాత ఉప్పు వేసి కలుపుకుని రాత్రంతా ఉంచేయాలి. ఉల్లిపాయల్ని , క్యారెట్లని సన్నగా తరగాలి. పెనంపై నూనె వేసి అర అంగుళం దళసరిన గుండ్రంగా ఊతప్పం వేసి పైన ఉల్లి, క్యారెట్ తురుముల్ని చల్లి కొద్దిగా ఒత్తుకోవాలి. సన్నని మంటపైన రెండు వైపులా దోరగా కాల్చుకుని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇది బలవర్ధకమైన ఫలహారం కూడా.