కావలసిన పదార్థాలు:
పెండలం దుంపలు - 2, పచ్చిమిర్చి - 4, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు -
రుచికి తగినంత, జీలకర్ర - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:పెండలం దుంపల్ని తొక్క తీసి ముక్కలుగా తరగాలి. మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, దుంప ముక్కలు వేసి తగినంత నీరు చేరుస్తూ దోశ పిండిలా జారుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర కలిపి కొద్ది దళసరిగా దోశల్లా పోసుకుని రెండువైపులా దోరగా వేగించుకోవాలి. ఈ దోశలు టమోటో చెట్నీతో బాగుంటాయి.