పుజాదికాల్లోను, వివాహం తదితర శుభకార్యాలు జరిగినప్పుడు పసుపు రాసిన బియ్యాన్ని అక్షతలు గా చల్లి ఆశీర్వదించటం మన సంప్రదాయం. అక్షతలు అంటే క్షతములు కానివి అని అర్ధం.భగ్నం కాని బియ్యాన్ని అక్షతలు అంటారు . నిండు గింజలైన అక్షతల లాగానే మీ జీవితం కుడా భగ్నం కాకుండా ఉండాలని, నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో సంతోషంగా జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తారు.