పని ఒత్తిడి ఎక్కువగా వున్నా, ఉబుసుపోకపోయినా అదే పనిగా టీలు, కాఫీలు
తాగేస్తూ వుంటారు కొందరు. మరికొందరు చిప్స్, ఫ్రెంచ్ఫ్రైలు నమిలేస్తూ
వుంటారు. ఈ రెండు అలవాట్లూ హానికరమే అంటున్నారు నిపుణులు. పదేపదే టీలు
కాఫీలు తాగటం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయని, ఊబకాయంతో పాటు
క్యాన్సర్ బారిన పడేందుకు ఆక్సిడింట్లు కారణం అవుతాయంటున్నారు నిపుణులు.
టీలు, కాఫీలకు బదులుగా గ్రీన్టీ తాగాలని, అది యాంటీ అక్సిడెంట్గా
పనిచేస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అలాగే వారాల తరబడి ఫ్రిజ్లో
వుంచినవి కాకుండా తాజా ఆకుకూరలు, కూరలు తినడం వల్ల క్యాన్సర్తో సహా అనేక
జబ్బులును ఆమడదూరంలో వుంచవచ్చంటున్నారు నిపుణులు. ఈ సూచనలు మీరూ పాటిస్తారు కదూ?