మహిళలు తమ డైట్లో నిమ్మ, బత్తాయి, నారింజ వంటి పుల్లటి పండ్లు ఉండేలా
చూసుకోవడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చని తాజా
అధ్యయనంలో తేలింది. బ్రిటన్లోని ఈస్ట్ ఏంగ్లీయా యూనివర్శిటీకి చెందిన
పోషకాహార నిపుణుడు యెదిన్ కాసిడే సి విటమిన్ ఉన్న పండ్లపై జరిపిన అధ్యయనంలో
ఈ విషయం వెల్లడయింది. ఈ పండ్లు యాంటీ ఇన్ఫ్లేమటరీలాగా పనిచేసి
రక్తనాళాల్లో రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయని పరిశోధకులు తేల్చారు.
కాసిడేతోపాటు అతని తోటి అధ్యాపకులు 14 ఏళ్లపాటు 69,622 మంది మహిళలను
పరీక్షించారు. మహిళలకు ప్రతి నాలుగు గంటలకు ఓ సారి పుల్లని పండ్లు ఆహారంగా
ఇచ్చి మరీ పరీక్షించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మహిళలూ మీరు పుల్లని పండ్లు
తీసుకుంటారు కదూ!