డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలి?

డయాబెటిస్ ఉందని తెలిసాక ఆహారం విషయంలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా తేనె, బెల్లం, పంచదార ఏ పదార్థాల్లోనూ లేకుండా చూసుకోవాలి. మధుమేహంతో బాధపడే వారు ఆహారం విషయంలో ఐదు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. రోజూ ఆహారంలో సుమారు నాలుగు టీ స్పూన్‌ల నూనె మాత్రమే ఉండేలా చూసుకోవాలి. మీరు తీసుకునే అహారంలో పీచు పదార్థాలు అధికంగా వుండేలా చూసుకోవాలి. అంటే రోజుకు సుమారు 400 నుంచి 500గ్రాములు కూరగాయలు తీసుకోవాలి.

డైట్‌లో చిరుధాన్యాలు ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజూ ఒకే రకమైనవి కాకుండా కలగలిపి తీసుకోవాలి. రైస్ మాత్రమే తీసుకోకుండా రైస్‌తో పాటు గోధుమలు, జొన్నలు, రాగులు..ఇలా రెండు, మూడు రకాల ధాన్యాలను కలిపి తీసుకోవాలి. సమయానుగుణంగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. డయాబెటిస్ ఉందని తెలిసినప్పుడు డైటీషియన్‌ను కలిసి ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరంగా తెలుసుకుంటే మంచిది. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా తీసుకునే ఆహారమే కీలకమనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top