బెంగుళూరులోని రాజ్భాగ్ హోటల్లో ఈ మధ్యనే ప్రవేశపెట్టిన దోసె తినాలంటే అక్షరాల రూ.1,011 చెల్లించాలి. ఒక దోసె ఖరీదు అంతెక్కువా? అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అది ఆషామాషీ దోసె కాదు...బంగారం దోసె. ఆ దోసె మీద బంగారం కళకళలాడుతుంటుంది మరి. వన్ గ్రామ్ గోల్డ్ కోటింగ్తో తయారు చేసిన దోసె అది. ఆ హోటల్ యజమానుల్లో ఒకరైన చందన్ లోకేష్ దాని గురించి వివరిస్తూ "ఒకసారి నేను అమెరికా వెళ్లినపుడు అక్కడ పిజ్జా, ఐస్క్రీమ్స్లలో బంగారం వాడటాన్ని చూశాను. అలా బంగారంతో తయారైన పదార్థం ధర అక్కడ వెయ్యి డాలర్లుగా నిర్ణయించారు.
దాంతో మన వంటకాల్లో బంగారం ఎందుకు ఉపయోగించకూడదని భావించి ఇక్కడ దోసెతో ఆ ప్రయోగం చేశాము. బంగారం చర్మానికి కీడు చేస్తుందని చాలామంది అంటుంటారు. నిజానికి స్టార్ హోటల్స్ ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ, స్వీట్స్లో బంగారం వినియోగిస్తూనే ఉంటాయి. అది చర్మానికి మేలేచేస్తుంది. రోజురోజుకూ ఈ బంగారం దోసెకు డిమాండ్ పెరగడం ఆనందంగా ఉంది'' అని పుత్తడి దోసె నేపథ్యం గురించి చెప్పుకొచ్చారాయన.
దాంతో మన వంటకాల్లో బంగారం ఎందుకు ఉపయోగించకూడదని భావించి ఇక్కడ దోసెతో ఆ ప్రయోగం చేశాము. బంగారం చర్మానికి కీడు చేస్తుందని చాలామంది అంటుంటారు. నిజానికి స్టార్ హోటల్స్ ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ, స్వీట్స్లో బంగారం వినియోగిస్తూనే ఉంటాయి. అది చర్మానికి మేలేచేస్తుంది. రోజురోజుకూ ఈ బంగారం దోసెకు డిమాండ్ పెరగడం ఆనందంగా ఉంది'' అని పుత్తడి దోసె నేపథ్యం గురించి చెప్పుకొచ్చారాయన.