తూర్పుగోదావరి జిల్లా ర్యాలిలో జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో ఈ విగ్రహం
ఉంది. ఐదడుగుల విగ్రహానికి ఒకవైపు కేశవస్వామి, రెండోవైపు జగన్మోహిని
మూర్తులు ఉన్నాయి. ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇది ఒక్కటే. ఇక్కడ మరో విశేషం
ఏమిటంటే... విగ్రహం పాదాల కింద నీరు ఊరుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రదేశం
రావులపాలేనికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.