ఎండలో తిరిగిన తర్వాత మొహమంతా వాడిపోతుంది. దీన్నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు

వేసవిలో ఒళ్లంతా కమిలిపోయినట్టు అవుతుంది. ఎండలో తిరిగిన తర్వాత మొహమంతా వాడిపోతుంది. దీన్నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఎండలో ప్రయాణం చేసినవారు ఇంటికి రాగానే రెండు టేబుల్ స్పూన్ల కీరా గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి మొహానికి పట్టించి పదినిమిషాల తర్వాత చల్లటినీటితో కడిగేసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.

- తలలో వేడిని తగ్గించడానికి అర కప్పు కీరాగుజ్జులో ఒక టేబుల్ స్పూను మెంతికూర గుజ్జు కలిపి మాడుకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.

- కళ్లు బాగా అలసిపోయినట్లు అనిపిస్తే రెండు కీరా ముక్కలు కళ్లపైన పెట్టుకుని నిద్రపోవాలి. ఫేస్‌ప్యాక్‌లో ఒక టీ స్పూను కీరాగుజ్జుని కలిపి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top