నల్లద్రాక్ష ఔషదం...

మధుమేహ వ్యాది నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నల్లద్రాక్ష తింటే ఒంట్లో చక్కెరస్థాయి అదుపులో ఉంటుందని చెబుతున్నారు అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీవారు. మూడు నెలలపాటు ఎలుకలపై చేసిన ప్రయోగంలో నల్లద్రాక్షలు తిన్నవాటికి రక్తపోటు, చక్కెరస్థాయి అదుపులో ఉన్నట్టు తేలింది. పుల్లగా ఉండే నల్లద్రాక్షల్లో చక్కెరశాతం చాలా తక్కువగా ఉండి, మన రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గించే శక్తి ఉందని చెబుతున్నారు పరిశోధకులు. మామూలుగానే జ్యూస్‌లలో నల్లద్రాక్షను బాగా ఉపయోగిస్తుంటారు. మధుమేహంతో ఇబ్బందిపడేవారు నాలుగు పండ్లు ఎక్కువ వేసుకుంటే మంచిదంటున్నారు పరిశోధకులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top