హిమాలయ పర్వతాలలోని అద్భుతమైన క్షేత్రం అమరనాథ్. ఈ హిమలింగ క్షేత్రం కాశ్మీర్ రాజధాని శ్రీనగర్కి 141 కి.మీల దూరంలో ఉంది. అమర్నాథ్ యాత్ర శ్రమతో కూడుకున్నది. అయినప్పటికీ సుందర ప్రకృతి దృశ్యాలు శ్రమను మరిపిస్తాయి. సముద్రమట్టానికి 14, 500 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలో ఏటా మంచుతో లింగం ఏర్పడుతుంది. భక్తులు శ్రావణపౌర్ణమి నాడు ఈ లింగాన్ని దర్శించుకుంటారు. ఏటా ఈ యాత్రను జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. యాత్రలో ఊహించని వాతావరణ పరిస్థితులు ఎదురవుతుంటాయి. శ్రీనగర్కి 90కి.మీల దూరంలో పహల్గావ్ ఉంది. అక్కడి నుంచి చందన్ వాడీ, పిస్నటాప్, శేషనాగ్, పంచతరణి మీదుగా అమర్నాథ్ గుహకు చేరాలి. ఈ గుహ 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. అమర్నాథ్ మంచులింగానికి ఇరువైపులా రెండు చిన్న మంచులింగాలు ఏర్పడతాయి. వాటిని పార్వతి, విఘ్నేశ్వరుల ప్రతిమలుగా భావిస్తారు. సాహసోపేతమైన ఈ యాత్ర అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది.
సహజ మంచులింగం ఎక్కడ?ఎలా చేరుకోవాలి?
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.