పంచభూత లింగాలలో వాయులింగం ఏ క్షేత్రంలో ఉంది? ఆ క్షేత్ర విశేషాలేమిటి?

పంచభూత లింగాలలో వాయులింగం ఒకటి. ఇది శ్రీకాళహస్తిలో ఉంది. ఈ ఆలయం చాలా పెద్దది. ఇక్కడి స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూలింగం. వాయులింగం అంటే ఇదే. ఈ ఆలయం రాజగోపురం సింహద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది. స్వామి ఉత్తరాభిముఖంగా ఉంటాడు. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. 

ఇక్కడ కొలువుదీరిన స్వామి సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షమిచ్చారని ఇక్కడి స్థలపురాణం. స్వామి తన భక్తుడైన కన్నప్పకు సాక్షాత్కారమిచ్చింది ఇక్కడేనని చెబుతారు. ఇది ప్రముఖ శైవారామం. ఈ ఆలయం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మితమైంది. వారణాసి క్షేత్రానికి, శ్రీకాళహస్తి క్షేత్రానికి పోలికలు ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి, దక్షిణ కైలాసం అని పిలుస్తారు. సత్యమహాభాస్కర క్షేత్రం, సద్యోముక్తి క్షేత్రం, శివానందైన నిలయం అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. 
ఈ ప్రదేశం స్వర్ణముఖి నది తీరాన ఉంది. ఇక్కడ రాహుకేతులకు చేసే పూజలు విశిష్టమైనవి. రోజూ వేలాదిమంది భక్తులు ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. శ్రీకాళహస్తిలోని శివమూర్తిలో అయిదు పడగల సర్పం అంతర్భాగంగా ఉండడం వల్ల దీనికి సర్పదోష నివారణ క్షేత్రం అని వాడుకలోకి వచ్చింది. శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బస, భోజన సౌకర్యాలు ఉన్నాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top