మన శరీరంలోని ఎముకల కంటె గట్టిగా ఉండే పదార్థం ఒకటుంది. అదే మన పళ్లపైన ఉండే ఎనామిల్. ఈ పదార్థం మన దంతాలపైన ఒక రక్షణ పొరలా వ్యాపించి, ఎన్నో రకాల విపత్తుల నుంచి పళ్లను కాపాడుతుంది. ఏ కారణం వల్లనయినా ఈ పొర అరిగిపోతే, అది మళ్ళీ ఎప్పటికీ రాదు. ఇంత దృఢమైన పొరని కూడా కొన్నిరకాల సూక్ష్మజీవులు ధ్వంసం చేయగలవు.
మనం సరిగ్గా పళ్లు తోముకోకపోవడం, ఏదైనా తిన్నాక పుక్కిలించకపోవటం వంటి కారణాల వల్ల మన పళ్ల సందుల్లో ఆహారపదార్థాలు ఇరుక్కుని, వాటిని ఆశ్రయించిన కొన్నిరకాల సూక్ష్మజీవులు పెరిగిపోతుంటాయి. ఈ జీవులు విడుదల చేసే ఒక రకం ఆమ్లంతో మన పళ్ల మీది ఎనామిల్ పొర దెబ్బతినడం మొదలవుతుంది. ఎనామిల్ పొరమీద రంధ్రం పడితే, దాని నుంచి సూక్ష్మక్రిములు లోపలకు ప్రవేశించి మిగతా పొరలనూ నాశనం చేస్తాయి. అందుకే దంతాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. |
రోజూ పళ్లు ఎందుకు శుభ్రం చేసుకోవాలి?
12:14:00 PM
Share to other apps