కర్నాటక రాష్ట్రంలో శనీశ్వరునికి పెద్ద దేవస్థానం ఉన్న క్షేత్రం ‘పావగడ’. ఇది అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి సుమారు 60 కి.మీ.ల దూరంలో ఉంది. శనీశ్వరునికి చిన్న మందిరం ఉంటుంది. కానీ ‘పావగడ’లో పెద్ద దేవస్థానం ఉంది. రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయంలో భక్తులు బస చేయడానికి సత్రాలు, కాటేజ్లు ఉన్నాయి. భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఆలయంలో స్వామి వారికి ఏటా మాఘశుద్ధ పౌర్ణమినాడు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో స్వామివారిని లక్షలాదిమంది భక్తులు దర్శిస్తారు. ఇక్కడ శనీశ్వరుని దర్శించుకునే భక్తులకు ఎలాంటి శనిదోషాలున్నా తొలగిపోతాయని, శాంతిసౌఖ్యాలు చేకూరతాయని విశ్వాసం.