ఉప్పు ఎక్కువగా తింటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందన్న సూకా్ష్మన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన నియమం ఇది. సాధారణంగా మనం తినే ఆహారంలోనే సోడియం ఉంటుంది. పైగా రుచి కోసం అన్ని కూరల్లోనూ ఉప్పు వేస్తాం. పగలు శారీరకంగా శ్రమించేటప్పుడు దేహం నుంచి చెమట రూపంలో సోడియం బయటకు పోతుంది. నీరసం ఆవహిస్తుంది. అలాంటప్పుడు ఆహారంలో ఉప్పు వేసుకుంటే శరీరం... కోల్పోయిన లవణాలను తిరిగి వెంటనే భర్తీ చేసుకుంటుంది. మజ్జిగలో ఉప్పు వేసుకోవడం, పాడి లేని వాళ్లు అన్నంలో నీళ్లుపోసుకుని ఉప్పు కలుపుకుని తినడం వంటి అలవాట్లన్నీ ఇలా వచ్చినవే. అయితే రాత్రి శారీరక శ్రమ ఉండదు కాబట్టి శరీరానికి తక్షణం లవణాలు అందించాల్సిన అవసరం ఉండదు. అందుకే రాత్రి ఉప్పు వాడకూడదనే నియమం పెట్టారు. దీనిని ఎంత కచ్చితంగా చెప్పారంటే రాత్రి పూట ఉప్పును తలవడం కూడా పాపం అనేటంతగా విశ్వాసాన్ని పెంపొందించారు.