పండ్లతో పళ్లు మిలమిలా!

మనకు ప్రకృతిలో సహజంగా లభించే పండ్లు అన్ని కాలాల్లోనూ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో అయితే భానుడి తాపాన్ని చల్లార్చేందుకు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే పండ్లు కేవలం వేసవి తాపాన్ని తీర్చేందుకు మాత్రమే కాదు. ’’పళ్ల’’ను మిలమిలా మెరిసిపోయేలా చేస్తాయి. 

ఇలాంటి వాటిలో సిట్రస్‌ గ్రూపునకు చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా ఫలం, ఉసిరి, ఫైనాఫిల్‌, నల్లనేరేడు, దాక్ష, జామలతో పాటు మామిడి, బొప్పాయి, పనస, సపోటా, ఖర్బూజా ఆపిల్‌, అరటి, సీతాఫలం, పుచ్చకాయలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సిట్రిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండే పండ్లలో విటమిన్‌-సి సమౄఎద్ధిగా లభించటం వల్ల చిగుళ్ల, పళ్ల ఆరోగ్యానికి మంచిది.

ఈ సిట్రిక్‌ ఆమ్లం పళ్లపై పేరుకున్న జిగురుపొరను తొలగించి పళ్లు మిలమిలా మెరిసిపోయేలా చేస్తుంది. సిట్రిక్‌ ఆమ్లం ఒక డిటెర్జెంటులా కూడా పనిచేస్తుంది. కొన్ని రకాల పండ్లను కొరకడం వల్ల ముందరి పళ్లకు, బాగా నమలడం వల్ల పక్క దంతాలకు మంచి వ్యాయామం అందుతుంది. ఇలా నమిలేటప్పుడు పళ్ళు చిగుళ్లకు రాపిడి ఇవ్వడం వల్ల అవి కూడా గట్టిపడతాయి. ఇలాంటి వ్యాయామం వల్ల చిగుళ్లవ్యాధులు, దంతక్షయాలను నివారించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top