బుల్లితెర మీద యాంకర్లు హాట్ హాట్గా చెలరేగిపోతున్న దశలో కూడా పద్ధతిగా, సాంప్రదాయ వస్త్రధారణలోనే కనిపించి పాపులర్ అయిన యాంకర్ లాస్య. ముఖ్యంగా కో-యాంకర్ రవితో ఆమె కాంబినేషన్ సూపర్ హిట్. వారిద్దరి జోడీ బుల్లితెర అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. అయితే ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది లాస్య. అంతేకాదు భవిష్యత్తులో ఇక రవితో కలిసి యాంకరింగ్ చేసేది లేదని స్పష్టం చేసింది.
CLICKHERE : ఈ 11 మంది హీరోల సెల్ ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా!
‘యాంకర్ రవికి, నాకు మధ్య విభేదాలు వచ్చిన మాట నిజమే. బాగా పాపులర్ అయిన తర్వాత ఇగో ప్రాబ్లెమ్స్ అందరిలోనూ వస్తుంటాయి. అలాగే మా మధ్యా క్లాషెస్ వచ్చాయి. ముఖ్యంగా రవికి, నాకు మధ్య ఏదో ఉందని వార్తలు తెగ ప్రచారం అయిపోయాయి. ఆ రూమర్లు మా కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టేందుకే రవితో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయను.
CLICKHERE : ఈమె 12రోజుల పాటు కేవలం అరటిపండ్లునే ఆహారంగా తీసుకుంది.. ఆపై ఏమైందో తెలిస్తే షాకౌతారు!
ఇక, నాకు కాబోయే శ్రీవారు మంజునాథ్తో నా ప్రేమ వ్యవహారం ఏడేళ్లుగా సాగుతోంది. సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని ఇన్ని రోజులూ ఆగాం. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి యాంకరింగ్కు బ్రేక్ ఇచ్చా. మళ్లీ మార్చి నుంచి కెరీర్ మొదలుపెడతాన’ని లాస్య చెప్పింది.

