ఎయిర్‌టెల్ సరికొత్త ఎత్తుగడ... రూ.150 మంత్లీ ప్లాన్‌‌తో జియోకు స్కెచ్!


రిలయన్స్ జియోకు చెక్ పెట్టేందుకు ఎయిర్‌టెల్ మరో సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 345 రూపాయల ప్యాక్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఈసారి ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ సేవలపై దృష్టిసారించింది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఓ చౌక ప్యాక్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

అందులో భాగంగానే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు 150 రూపాయల సరికొత్త ప్యాక్‌ను ఎయిర్‌టెల్ అందించనున్నట్లు సమాచారం. 150 రూపాయల ప్యాక్‌తో రోజుకు 1జీబీ డేటాను 28రోజుల వ్యాలిడిటీతో అందించడానికి ఎయిర్‌టెల్ వ్యూహరచన చేస్తోంది. ఈ 1జీబీ డేటాలో 500 ఎంబీ పగలు, 500 ఎంబీ రాత్రి 12 తర్వాత వినియోగించుకునే విధంగా ప్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. జియోను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది డేటానే ఆశిస్తున్నారని ఎయిర్‌టెల్ భావిస్తోంది. అందులో భాగంగానే వాయిస్ కాల్స్‌తో సంబంధం లేకుండా ఈ 150 రూపాయల మంత్లీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top