జియోకి జేజెమ్మ లాంటి ఆఫర్..!


రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం రంగంలోని ఇతర కంపెనీలన్నీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. మొన్న ఐడియా, నిన్న ఎయిర్‌టెల్.. తాజాగా ఇవాళ టెలినార్. ఇలా అన్ని కంపెనీలు కస్టమర్ ను ఆశ్చర్యపర్చే ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఎవరూ ఊహించని రీతిలో ఓ సంచలన ఆఫర్‌కు తెరలేపింది. 47 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా అందించనున్నట్లు ప్రకటించి జియోను కూడా విస్తుపోయేలా చేసింది. 28రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌‌ను అందించనున్నట్లు టెలినార్ తెలిపింది. రోజుకు 2జీబీ వరకూ మాత్రమే వినియోగించుకునే అవకాశమున్నట్లు పేర్కొంది. దీంతో..

ఈ ప్లాన్‌తో 1జీబీ డేటాను 80 పైసలకే అందించనున్నట్లు టెలినార్ ప్రకటించింది. అయితే కేవలం ఎంపిక చేసిన 4జీ సర్కిల్స్‌లో, ఎంపిక చేసిన కస్టమర్స్ మాత్రమే ఈ ఆఫర్‌ను పొందే అవకాశముంది. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే, ఎటువంటి వాయిస్ కాల్స్‌కు అనుమతి ఉండదని టెలినార్ స్పష్టం చేసింది. అయితే జియో మాత్రం ఈ ఆఫర్ వల్ల తమకొచ్చిన నష్టమేమీ లేదంటోంది. టెలినార్ ప్రకటించిన తాజా ఆఫర్‌‌కు ధీటుగా ఎలాంటి ఆఫర్‌ను ప్రకటించాలనే యోచనలో ఇతర టెలికాం కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top