రోజు రోజుకి అప్ గ్రేడ్ అవుతున్న వాట్సాప్ లో రకరకాల కొత్త ఫీచర్స్ దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్ ని ప్రవేశ పెట్టనుంచి ఈ మెసేజింగ్ దిగ్గజం. సాధారణంగా ఒకరికి పంపిన మెసేజ్ ఇంకొకరికి పంపించాలంటే.. ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడంలేదా కాపీ పేస్టు చేయడం లాంటివి చేయాలి. లేదా ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసుకొని బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకోవాలి.
లేదంటే గ్రూప్ క్రియేట్ చేయాల్సి ఉండేది. కాని ఇక మీదట ఎవరికివారికి వేర్వేరుగా మెసేజ్ పంపించే ఆప్షన్ ప్రవేశ పెడుతుంది. ఈ మల్టిపుల్ కాంటాక్ట్ సెలక్షన్ ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కొందఱు ఈ ఫీచర్ ని బీటా వెర్షన్ లో వాడుతున్నారు. మొబైల్ లో ఎస్ఎంసే పంపేటప్పుడు ఎలాగైతే కాంటాక్ట్స్ సేలేక్ట్ చేస్తామో అదే విధంగా వాట్సాప్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.