రిలయన్స్ జియో ఆఫర్ల దాటికి మిగిలిన టెలికాం రంగం వణికిపోతుంది. ప్రతీ రోజు ఎవరికీ వారు ఎన్ని ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుందామననుకున్నా జియో తో పోటీ చేయడం కష్టంగానే ఉంది. తాజాగా జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. జియోఫై4జి రూటర్తో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.
జియో రెండు ప్లాన్స్తో ముందుకురాగా… మొదటి ప్లాన్లో భాగంగా డేటాకార్డ్, డాంగిల్, హాట్స్పాట్ రూటర్ను జియో డిజిటల్ స్టోర్లో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే వందశాతం క్యాష్బ్యాక్ ఇస్తూ… డివైజ్లను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.2010 విలువైన 4జీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికి జియో ఫై రూటర్ కోసం వినియోగదారులు రూ.1999 చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు రూ.399 ప్లాన్ కింద తొలిసారి రూ.408తో రీచార్జ్ చేసుకోవాలి. అలాగే రూ.99 జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకుని ఉండాలి. వినియోగదారులు రూటర్ కోసం రూ.1999 చెల్లిస్తే రూ.2010 విలువైన 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనిని బట్టి యూజర్ కి ఇంటర్నెట్ కనక్షన్ ఫ్రీ అన్నమాట.
జియో రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్ఛేంజ్ చేసుకోవాల్సన అవసరం లేకుండా … రూ.408తో మొదటి రీచార్జ్ చేయించుకుంటే రూ.1999కే జియోఫై అందుబాటులోకి వస్తుంది. ఈ ఆఫర్లో కేవలం రూ.1005 విలువైన 4జీ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర టెల్కోల డాంగిల్స్, డేటాకార్డులు వాడుతున్నవారు, ఈ ఆఫర్ తో చాలామంది జియో వైపు మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇంకా జియో ఎలాంటి ఆఫర్లతో టెలీకాం రంగల్లో సంచనాలు సృష్టించబోతుందో…