వేసవి అంటేనే మనకి గుర్తు వచ్చేది మామిడిపండు ఎంతో తియ్యగా రుచికరంగా ఉండే ఈ పండు ఇష్టపడని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు,అయితే చాలా మంది మామిడి పండుని పెరుగు అన్నంలో తినడానికి ఇష్టపడతారు,అయితే మామిడి పండుని పెరుగుఅన్నంలో కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో ఎలాంటి ప్రతిఫలం వస్తుందో ఇప్పుడు చూద్దాము.
మామిడి పండు పెరుగు అన్నంలో కలిపి తింటే కలిగే లాభాలు
మామిడి పండులో కాన్సర్ తో పోరాడే కణాలు ఉంటాయి ఇవి శరీరంలో కాన్సర్ కలిగించే జీవాలను నాశనం చెయ్యడమే కాకుండా రోగానిరోధిక శక్తీ పెంచుతుంది,ముఖ్యంగా ఆడవాళ్లకు గర్భాశయ మరియు రొమ్ము కాన్సర్ లను దూరం చేస్తుంది.
మామిడి పండులో చాలా అధికంగా కాల్షియం ఉంటుంది పైగా పెరుగులో కూడా కాల్షియం ఉంటుంది దీనివల్ల ఎముకలు ఉక్కులగా మారుతాయి మోకాళ్ళు కిళ్ళ నొప్పులు మాయం అవుతాయి మరియు లక్తోబసిలాస్ అనే పదార్ధం పొట్టలోని జీర్ణం అవ్వడానికి దోహద పడుతుంది.
మామిడి పండు అన్నం లో ముఖ్యంగా పెరుగు అన్నంలో కలిపి తినడం వల్ల విటమిన్ ఎ,విటమిన్ సి,విటమిన్ బి ఎక్కువగా శరీరానికి లభిస్తాయి దీనివల్ల జుట్టు ఒత్తుగా పెరగడం చర్మం అందంగా మెరవడం లాంటివి జరుగుతాయి.