భారతదేశంలో ఎక్కువమంది ప్రయాణికులు ఆధారపడేది రైల్వే పైనే. అటువంటి రైల్వే ప్రయాణికులకి ఈ వార్త బ్యాడ్ న్యూసే. సాధారంగా పెద్దవారు, ఆడవాళ్ళు, పిల్లల తల్లులు ఇలాంటి వారంతా రైల్వే ప్రయాణాలలో లోవర్ బర్త్ ను కోరుకుంటారు. అలాంటి రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ గట్టి షాకే ఇవ్వనుంది.
విమానాల్లో విండో సీట్ల కేటాయింపునకు అధిక చార్జీ వసూలు చేసినట్టుగానే రైళ్లలో కూడా లోయర్బెర్త్ బుకింగ్లపై చార్జీలు పెంచే ఉద్దేశంలో ఉంది. లోవర్ బర్త్ కోరుకునే వారికి అదనపు చార్జీలు బాధడానికి అన్ని సిద్దం చేస్తుంది. ఈ సీట్లకు బాగా డిమాండ్ ఉండటం వలన రైల్వే ఈ నిర్ణయం తీసుకోనుంది. కింది బెర్త్ బుకింగ్లపై రూ .50 పెంచాలని భారత రైల్వే శాఖ సిఫారసు చేసినట్టు సమాచారం.