సాయంత్రం సమయంలో లేదా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత విశ్రాంతి తీసుకొనే సమయంలో ఏదైనా తింటే బాగుంటుందని అనిపించటం సహజం. ఆ సమయంలో ఆహార పదార్దాలు కాకుండా బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రిమ్స్, చిప్స్ వంటివి లాగించేస్తూ ఉంటారు. తినాలన్నా కోరికను తీర్చుకుంటారు కానీ అవి తినటం వలన మన శరీరంలో వచ్చి చేరే క్యాలరీలు గాని,కొవ్వును గాని ఏ మాత్రం పట్టించుకోరు.
ఈ విధమైన చిరు తిండి తినాలనే కోరిక కలిగినప్పుడు ఒక పావుగంట పాటు బ్రిస్క్ వాక్ చేసి చూడమని అంటున్నారు పరిశోదకులు. నడక వలన తినాలనే కోరిక నశిస్తుందని పరిశోదకులు అంటున్నారు. అధిక బరువు కలిగిన 50 మంది మీద సుమారు మూడు రోజుల పాటు పరిశోదన నిర్వహించారు.
వీరిని రెండు గ్రూపులుగా విభజించి వారికీ తినాలన్న కోరిక కలిగినప్పుడు ఒక గ్రూప్ చేత ఒక పావుగంట సేపు బ్రిస్క్ వాక్ చేయించారు. మరో గ్రూప్ చేత ఎటువంటి వ్యాయామాన్ని చేయించలేదు. బ్రిస్జ్ వాక్ చేయించిన వారిలో తినాలనే కోరిక నశించినట్టు గమనించారు. అయితే దీని మీద ఇంకా లోతుగా పరిశోదన చేయవలసి ఉంది.