ఉదయం సమయంలో ప్రోటీన్ తో కూడిన బ్రేక్ఫాస్ట్ చేస్తే అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ప్రోటీన్ సమృద్దిగా ఉండే శనగలతో దోశ తయారు చేసుకొని తింటే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.
కావలసినవి
ఒక కప్పు శనగలు, 2 కప్పుల బియ్యం, అరస్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఉప్పు,నూనె వేగించటానికి, నానబెట్టటానికి నీరు.
తయారి విధానం
ముందుగా, ఒక పెద్ద గిన్నెలో 2 కప్పు బియ్యం, 1 కప్పు శనగలు, ½ స్పూన్ మెంతులు తీసుకోండి. బాగా కడిగి కనీసం 6 గంటలు నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన బియ్యం మరియు శనగలను మిక్సర్ గ్రైండర్లో వేసి సరిపడా నీటిని పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ పిండిని 8 గంటల పాటు అలా వదిలేస్తే పులుస్తుంది. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. దోస పాన్ వేడి చేసి పిండిని dosa మాదిరిగా వేయాలి. Dosa చుట్టూ అరస్పూన్ నూనె వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి.