కావాల్సిన పదార్థాలు:
- వంకాయలు - అర కిలో (గుండ్రంగా ఉన్నవి)
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - కొద్దిగా
మసాలా కోసం పదార్థాలు:
- శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- మినపప్పు - అర టీస్పూన్
- ధనియాలు - అర టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 10 నుండి 12
- ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు
- కరివేపాకు - 2 రెమ్మలు
- వేరుశనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 5
- నూనె - 1 టీస్పూన్
తయారీ విధానం:
1. వంకాయలను నాలుగు ముక్కలుగా కోసి, ఉప్పు నీటిలో వేయాలి.
2. కళాయిలో వేరుశనగ పప్పును దోరగా వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి.
3. అదే కళాయిలో శనగపప్పు వేసి వేగిన తర్వాత, మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
4. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి వేసి వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి.
5. అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత, మిక్సీ జార్లో శనగపప్పు, దినుసులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
6. ఆ తర్వాత ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసి, వేరుశనగతో సహా మిగిలిన పదార్థాలు వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఈ పొడిని వంకాయల్లో స్టఫ్ చేయాలి.
8. కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడయ్యాక, స్టఫ్ చేసిన వంకాయలను వేసి మూత పెట్టి చిన్న మంటపై వేయించాలి.
9. వంకాయలను మధ్య మధ్యలో తిప్పుతూ, మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.
10. వంకాయలు మెత్తగా అయిన తర్వాత, మిగిలిన మసాలా పొడిని చల్లి, ఒక నిమిషం వేయించి, కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయాలి.
ఇలా రుచికరమైన గుత్తి వంకాయ వేపుడు సిద్ధమవుతుంది!