
ఈ హైప్ సినిమా వ్యాపారం, అడ్వాన్స్ బుకింగ్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్సీస్లో ‘కింగ్డమ్’ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, నార్త్ అమెరికాలో ఇప్పటికే 5 లక్షల డాలర్లు (సుమారు 4 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి, దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడయినట్లు సమాచారం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ‘కింగ్డమ్’ విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. మొదటి రోజు 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టవచ్చని, పాజిటివ్ టాక్ వస్తే 50 కోట్లు కూడా సులభంగా దాటే అవకాశం ఉందని అంటున్నారు. అలా జరిగితే, ఇది విజయ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రికార్డును సృష్టించే సినిమాగా నిలుస్తుంది.
సినిమా బడ్జెట్ విషయానికొస్తే, నిర్మాత నాగవంశీ గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కింగ్డమ్’ బడ్జెట్ సుమారు 130 కోట్ల రూపాయలని వెల్లడించారు. అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైందని, బడ్జెట్ ప్లాన్ చేయలేదని ఆయన తెలిపారు.
ప్రీ-రిలీజ్ వ్యాపారం విషయంలో, ‘ట్రాక్ టాలీవుడ్’ నివేదిక ప్రకారం, ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సాధించింది. నైజాంలో 15 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్లు, సీడెడ్లో 6 కోట్లు, ఓవర్సీస్ మరియు ఇతర భారతీయ మార్కెట్లలో కలిపి మొత్తం 50 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.
అంతేకాక, నెట్ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో, రిలీజ్కు ముందే నిర్మాతలకు 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు అంచనా. మిగిలిన బడ్జెట్ను థియేట్రికల్ వసూళ్ల ద్వారా రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే, సినిమా 300 నుంచి 400 కోట్ల రూపాయల వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బయ్యర్లు సేఫ్ జోన్లో ఉండాలంటే, సినిమా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి, నిర్మాతలు సేఫ్ అవ్వాలంటే 200 కోట్ల రూపాయలు సాధించాలి. అప్పుడే ఈ చిత్రం హిట్గా నిలుస్తుంది. సినిమా ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రల్లో నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు పెద్ద ఆస్తిగా నిలిచింది. ఈ చిత్రం జులై 31, 2025న గురువారం విడుదలైంది.