ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలన్న వచ్చిన సమస్యలు తగ్గాలన్న మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ రోజు మనం మినప్పప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పాయసం తీసుకుంటే ఎముకలు బలంగా ఉండటమే కాకుండా ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది.
కావలసిన పదార్థాలు
రెండు కప్పుల మినప్పప్పు
మూడు కప్పుల పాలు
కప్పున్నర పంచదార
ఒక కప్పు బెల్లం
రుచికి సరిపడా ఉప్పు
నాలుగు స్పూన్ల నెయ్యి
పది కిస్మిస్లు
పది బాదంపప్పులు
అర స్పూను యాలకుల పొడి
ముందుగా మినప్పప్పును శుభ్రంగా కడిగి ఉడికించాలి. ఉడికిన మినప్పప్పులో పాలు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత బెల్లం ముక్కలు వేయాలి. దీనిలో వేగించిన బాదం పప్పులు వేగించిన కిస్మిస్ వేసి బాగా కలపాలి.
ఇక చివరిగా యాలకులపొడి వేసి బాగా కలిపి పొయ్యి మీద నుంచి కిందకి దింపేయాలి. వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు

