7 శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తీరడమే కాకుండా.... అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి


శనివారం వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పురోహితులు అంటున్నారు. అలనాడు వైష్ణవులు శనివారం పూట శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి.

అందుచేత శనివారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానం ఆచరించి తులసికోట ముందు నేతితో గాని, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తులసికోట ముందు దీపమెలిగిస్తే.. ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.

అలాగే శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వరుడి ఆలయం లేదా విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో దీపమెలిగించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
శనివారం పూట ఒక పూట మాత్రమే భుజించి, శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుడిని ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావంచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
CLICKHERE : అన్నం తింటే లావు అవుతారు....కానీ అన్నం తో చేసిన జావా త్రాగితే స్లిమ్ అయిపోతారు...ఎలా???

ఇంకా తొమ్మిది వారాల పాటు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించుకుని, వెంకటేశ్వరస్వామికి ఏడు సార్లు ప్రదక్షిణ చేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు సూచిస్తున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top