జియో ఆఫర్ పొడిగింపు!


సంచలనాల జియో… కస్టమర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. ప్రైమ్ మెంబర్షిప్ పొందేందుకు యూజర్లకు మరో అవకాశాన్ని ఇస్తోంది. వరుస ప్రకటనలతో టెలికాం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న జియో.. తాజాగా మరో ప్రకటనకు రెడీ అయ్యింది. ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ కోసం ప్ర‌స్తుతం ఉన్న మార్చి 31 డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 30 వ‌ర‌కు పెంచే ఆలోచ‌న‌లో కూడా జియో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు 2.7 కోట్ల మంది జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌లో చేరిన‌ట్లు కంపెనీ లెక్కలు చెబుతున్నాయి. మొదట రూ.99లుగా చెప్పిన ప్రైమ్ మెంబర్ షిప్ తర్వాత ఫ్రీగా చేసుకోమన్నా చాలా మంది ముందుకు రాలేదు. దీంతో వారి కోసం మరో నెల రోజులు మెంబర్ షిప్ ఆఫర్ పొడిగించేందుకు సన్నద్ధమైంది. అలాగే రిల‌యెన్స్ జియో.. ఇప్పుడు కొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది.

CLICKHERE : రాజమౌళి కూతురు మయూఖి ఎంత క్యూట్ గా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు

మార్చి 31లోపు రూ.149, ఆపై రీచార్జ్ చేసుకొనే వారికి ఉచితంగా 2 జీబీ, 5 జీబీ, 10 జీబీ డేటాను అందిస్తున్న‌ది. రూ.149 రీచార్జ్‌పై ప్ర‌స్తుతం నెల‌కు 2 జీబీ 4జీ డేటా వ‌స్తుండ‌గా.. దీనికి అద‌నంగా మ‌రో 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తారు. ఇక రూ.303 రీచార్జ్ చేసుకొనేవారికి నెల‌కు 28 జీబీ డేటా వ‌స్తుండ‌గా.. దీనికి అద‌నంగా మ‌రో 5 జీబీ ఉచితంగా ల‌భిస్తుంది. రూ.499 రీచార్జ్‌తో ప్ర‌స్తుత‌మున్న డేటాతోపాటు అద‌నంగా నెల‌కు 10 జీబీ డేటా ఉచితంగా ఇవ్వ‌నున్నారు. అంటే 499 రీచార్జ్ చేసుకునేవారికి ఏడాదికి 120 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. మార్చి 31లోపు రీచార్జ్ చేసుకుంటే.. ఈ యాడ్ ఆన్ ప్యాక్స్ ప్ర‌తి నెలా యాడ‌వుతూనే ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top