దేశంలోనే అత్యంత చవకైన ప్లాన్ ని ప్రవేశ పెట్టిన బీఎస్ఎన్ఎల్!


ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. ‘ఎక్స్‌పీరియన్స్ అన్‌లిమిటెడ్ బీబీ 249’ పేరుతో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.249 నెలవారీ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు రోజుకు 10 జీబీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 2 ఎంబీపీఎస్ వేగం, ఉచిత ఇన్‌స్టలేషన్‌తో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కింద ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్న బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటలకు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చని పేర్కొంది.

కొత్త వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లోకి ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను ప్రకటించింది. అత్యంత చౌక ధరకే రోజుకు 10 జీబీ డేటా డౌన్‌లోడ్‌తో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న టెలికం సంస్థ దేశంలో బీఎస్ఎన్ఎల్ ఒక్కటేనని బీఎస్ఎన్ఎల్ బోర్డ్ డైరెక్టర్(ఎన్ఎఫ్ఏ) ఎన్‌కే గుప్తా తెలిపారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top