దీంతో మీరు వచ్చి చెయ్యండి సార్ తెలుస్తుంది అంటారు సుదీర్ టీం.దీంతో ఒళ్ళు మండిన నాగబాబు..మీకు పొగరు, అహంకారం అన్నీ నెత్తికి ఎక్కాయిరా, జబర్దస్త్ నుంచి వెళ్ళిపోండి గెట్ ఔట్ అంటాడు. దీంతో టీం అంతా వెళ్ళిపోతుంది. అసలు అది జోకా? సీరియస్? అనే విషయం పక్కన పెట్టిన కొందరు ప్రేక్షకులు మాత్రం నాగబాబు-రోజాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక ప్రోగ్రాంకి జడ్జ్ లుగా ఉంటూ మరీ ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చయ్యడం అవసరమా? అని మండిపడుతున్నారు. ఈ రోజుల్లో జనాలు అంత ఎర్రిపప్పలు ఎవరూ లేరని, ఈటీవీ లాంటి పెద్ద ఛానెల్ లో రేటింగ్ కోసం ఇలా చెయ్యడం ఏమీ బాగోలేదని కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ తరువాత అసలు విషయం బయటపడింది. మార్చ్ పూర్తి అయ్యి ఏప్రిల్ వస్తుంది కాదా? జబర్దస్త్ ప్రేక్షకులను ఏప్రిల్ పూల్ చెయ్యడానికే ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. మరి ఎంతమంది ఫూల్ అయ్యారో తెలియాల్సిఉంది.
నాగబాబు-రోజాకి మరీ ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా..?
2:33:00 PM
Share to other apps

