కావల్సినవి:
బంగాళాదుంపలు- రెండు
పనీర్- 250గ్రాములు
కొత్తిమీర-కట్ట
ఉప్పు- రుచికి తగినంత
పచ్చిమిర్చి ముద్ద- రెండు చెంచాలు
పచ్చిబఠాణీలు- వందగ్రాములు
గరం మసాలా- చెంచా
నూనె- మూడు చెంచాలు
తయారీ:
బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలను ఉడికించి పెట్టుకోవాలి. పనీర్ను సన్నగా తురిమి నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపల్ని మరో గిన్నెలోకి తీసుకొని చేత్తో మెత్తగా మెదపాలి. అందులో ఉడికించిన పచ్చిబఠాణీలు, వేయించిన పనీర్, కొత్తిమీర తరుగు, గరంమసాలా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియతిప్పాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆలూ మిశ్రమాన్ని చేత్తో వడ మాదిరి చేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చితే ఆలూ పనీర్ టిక్కీ తయారయినట్టే. వీటిని వేడివేడిగా టమాటా సాస్తో తింటే భలేగా ఉంటాయి.
బంగాళాదుంపలు- రెండు
పనీర్- 250గ్రాములు
కొత్తిమీర-కట్ట
ఉప్పు- రుచికి తగినంత
పచ్చిమిర్చి ముద్ద- రెండు చెంచాలు
పచ్చిబఠాణీలు- వందగ్రాములు
గరం మసాలా- చెంచా
నూనె- మూడు చెంచాలు
తయారీ:
బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలను ఉడికించి పెట్టుకోవాలి. పనీర్ను సన్నగా తురిమి నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపల్ని మరో గిన్నెలోకి తీసుకొని చేత్తో మెత్తగా మెదపాలి. అందులో ఉడికించిన పచ్చిబఠాణీలు, వేయించిన పనీర్, కొత్తిమీర తరుగు, గరంమసాలా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియతిప్పాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆలూ మిశ్రమాన్ని చేత్తో వడ మాదిరి చేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చితే ఆలూ పనీర్ టిక్కీ తయారయినట్టే. వీటిని వేడివేడిగా టమాటా సాస్తో తింటే భలేగా ఉంటాయి.