'ఎనర్జీ' లేని డ్రింక్స్

తిండి మానేసి మరీ ఎనర్జీడ్రింక్‌లను తాగుతున్నారు యువత. ఇటువంటి వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయిందీ మధ్య. ఎనర్జీడ్రింక్‌ల వల్ల శక్తి వచ్చే విషయాన్ని పక్కనపెడితే ఇవి ఆరోగ్యానికి ఎక్కువ హాని చేస్తున్నాయని వెల్లడైంది. అంతేకాదు ఎనర్జీడ్రింక్‌లు ఆల్కహాల్ సేవనాన్ని పెంచుతున్నాయంటున్నారు పరిశోధకులు. కారణం ఎనర్జీ డ్రింక్‌ల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ కెఫైన్ ఉండడమే. అంతేకాకుండా మూర్ఛలు, స్ట్రోక్స్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

కొన్నిసార్లు మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్ఇ) అనే స్వచ్ఛందసంస్థ. ఎనర్జీ డ్రింక్‌ల వల్ల కలిగే లాభం కంటే సరిచేయడానికి వీలులేని హాని కలుగుతోంది. ఇప్పుడు భారతదేశంలో ఎనర్జీడ్రింక్‌ల పరిశ్రమ 250 కోట్ల బిజినెస్ చేస్తోంది. ఇది సంవత్సరానికి 20 శాతం చొప్పున పెరుగుతోంది. మనదేశంలో ఎనర్జీ డ్రింక్‌లను ఎక్కువగా ఆల్కహాల్‌తో కలిపి వినియోగిస్తున్నారు.

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఎనర్జీ డ్రింక్‌లుగా పిలిచే వీటిని స్పోర్ట్స్ డ్రింక్స్‌గా మార్కెట్ చేయడం. ఎనర్జీ డ్రింక్‌లు శరీరాన్ని రీ-హైడ్రేట్ చేయడంలేదు. అంతేకాకుండా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు వీటి సేవనం చేస్తే శక్తి విషయాన్ని పక్కనపెడితే డీ-హైడ్రేషన్‌కి గురవుతున్నారు. అంటే ఎనర్జీడ్రింక్‌ల్లో ఎనర్జీ నేతిబీరకాయల్లో నెయ్యి అన్నమాట. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top