నాలుగు టీ స్పూన్ల తేనెలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, చేతి వేళ్లతో మసాజ్ చేసి పది నిమిషాల పాటు ఈ మాస్క్ని ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం పొడిబారడం తగ్గడమే కాకుండా మృదువుగా ఉంటుంది.