మనసు
బాగోకపోతే.. శారీరకంగానూ బోలెడు ఇబ్బందులు అంటున్నాయి అధ్యయనాలు.
మనసు కలత చెందితే.. శరీరానికి వచ్చిన నష్టమేంటి అనుకోవచ్చు. కానీ కుంగుబాటు,
వ్యాకులతల వల్ల ఎముకలు బలహీనపడిపోతాయని నార్వేకు చెందిన నిపుణులు
అంటున్నారు. తీవ్రమైన కుంగుబాటు వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
దాంతో ఎముకల్లో ఉండే క్యాల్షియం సాంద్రత తగ్గిపోయి చిన్నవయసులోనే కీళ్లనొప్పులు,
ఎముకలు గుల్లబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ప్రతి
చిన్న సమస్యనీ భూతద్దంలో పెట్టి చూడకుండా వాటికి వీలైనంత దూరంగా
ఉండాలి. సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు అధ్యయనకర్తలు.
దాంతోపాటు విటమిన్ 'డి' అందే పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
అలాగే బీన్స్, నువ్వులు, బక్రోలీ వంటివాటికి ప్రాధాన్యమివ్వాలి.