గోరువెచ్చని నీటిలో రెండు చెక్కల నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి, అందులో పాదాలను ఉంచాలి. 20 నిమిషాల తర్వాత నిమ్మతొక్కలను తిరగేసి పాదాలను, వేళ్లను రుద్ది కడగాలి. పాదాలను తుడిచి, మాయిశ్చరైజర్ లేదా బాదం ఆయిల్తో మసాజ్ చేయాలి. ఇలా నెలకు రెండుసార్లు చేయాలి.