కావల్సినవి:
మైదా- నాలుగు కప్పులు, బాదం, జీడిపప్పు, పిస్తా, వేరు సెనగలు- యాభైగ్రాముల చొప్పున (అన్నింటిని పొడి చేసుకోవాలి), యాలకుల పొడి- చెంచా, బెల్లం- రెండు కప్పులు, నూనె- రెండు కప్పులు, వంటసోడా- చిటికెడు, కొబ్బరి తురుము- అరకప్పు.
తయారీ:
ముందుగా గిన్నెలో మైదాపిండి రెండు కప్పులు తీసుకొని అందులో వంటసోడా, కాసిని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుసెనగలను పొడి చేసి పెట్టుకోవాలి. అందులో యాలకులపొడి, కొబ్బరి తురుము, బెల్లంతురుము కలిపి మిక్సీలో వేసి మళ్లీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చపాతీలో ఉంచి.. కజ్జికాయ ఆకారంలో ఒత్తుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీదపెట్టాలి. వేడయ్యాక కజ్జికాయలను వేయించుకొంటే సరిపోతుంది.
మైదా- నాలుగు కప్పులు, బాదం, జీడిపప్పు, పిస్తా, వేరు సెనగలు- యాభైగ్రాముల చొప్పున (అన్నింటిని పొడి చేసుకోవాలి), యాలకుల పొడి- చెంచా, బెల్లం- రెండు కప్పులు, నూనె- రెండు కప్పులు, వంటసోడా- చిటికెడు, కొబ్బరి తురుము- అరకప్పు.
తయారీ:
ముందుగా గిన్నెలో మైదాపిండి రెండు కప్పులు తీసుకొని అందులో వంటసోడా, కాసిని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుసెనగలను పొడి చేసి పెట్టుకోవాలి. అందులో యాలకులపొడి, కొబ్బరి తురుము, బెల్లంతురుము కలిపి మిక్సీలో వేసి మళ్లీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చపాతీలో ఉంచి.. కజ్జికాయ ఆకారంలో ఒత్తుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీదపెట్టాలి. వేడయ్యాక కజ్జికాయలను వేయించుకొంటే సరిపోతుంది.