సేఫ్ బ్రౌజింగ్ కోసం......

సైబర్ మోసగాళ్ల బారినపడుతున్న వారిలో మహిళల సంఖ్య తక్కువేంకాదు. అపరిచితులు పంపే మెయిల్స్‌ను ఓపెన్ చేయడం వల్ల, నెట్‌లో పరిచయమైన వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు వెల్లడించడం వల్ల సులువుగా మోసపోతున్నారు. వీరిలో చాలా మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడటం లేదు. కారణం అందరికీ తెలిసిందే. అయితే సైబర్ మోసగాళ్ల బారినపడకుండా ఉండాలంటే నెట్‌బ్రౌజింగ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

-పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌తో సహా.

- కంపెనీ పార్ట్‌నర్స్ కామన్ ఈమెయిల్ అకౌంట్స్ ఉండకుండా చూసుకోవాలి.

-పరిచయం లేని వ్యక్తులు పంపిన ఈ మెయిల్స్‌కి సమాధానం ఇవ్వకూడదు.

- కొత్తగా పరిచయమైన వ్యక్తులకు ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో పంపకూడదు.



-మీరు ఒక వెబ్‌సైట్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్లయితే సంబంధిత రిజిస్ట్రార్‌ను కలిసి డొమైన్ నేమ్‌ను రిజిస్టర్ చేసుకోవాలి.

- డొమైన్ నేమ్‌ను ఇతరులు ఉపయోగించకుండా లాక్ చేయాలి.

-పాస్‌వర్డ్‌లో అల్ఫాబెట్స్‌తో పాటు అంకెలు ఉండేలా చూసుకోవాలి. కొన్ని క్యాప్‌లాక్ఉంటే మరీ మంచిది.

-పరిచయంలేని వ్యక్తుల మెయిల్ ఐడీలను కాంటాక్ట్స్‌లో యాడ్ చేసుకోవద్దు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top