కొందకోనాలు... జలపాతాలు... పుణ్యక్షేత్రాలు... వెరసి ఓ చిరు ఇంద్రలోకం.. చిక్మగళూరు
11:02:00 AM
చిక్మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్మగళూరు పట్టణం నుండి వచ్చింది.
చిక్మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన
రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్మగళూరు
అని పేరు వచ్చిందని చెబుతారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద
చిక్మగళూరుకు 5 కిమీ దూరంలో హిరెమగళూరు కూడా ఉండడం విశేషం.
చిక్మగళూరు కి 90 కిమీలకు పశ్చిమంగా తుంగ నది ఒడ్డున శంకరా చార్యులు
అద్వైత ధర్మప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠమైన శారద పీఠానికి నిలయం
శృంగేరి. శృంగేరిలో శారదా దేవి దేవాలయం ఉన్నది, శారద దేవి ఆలయానికి ప్రక్కన
విద్యాశంకరులు స్మారకంగా నిర్మితమైన విద్యాశంకర్ దేవాలయం హొయసల రాజుల
కాలంలో ప్రారంభిం చబడి విజ యనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర
దేవాలయంలో 12 రాశులను సూచిస్తూ 12 స్థంభాలు ఉన్నాయి. సూర్యుడు ఏ రాశితో
ఉన్నాడో సూర్యకిరణాలు ఆ స్థంభం మీద పడుతుండడం ఇక్కడి విశేషం.
చిక్మగళూరుకు నైఋతిదిశలో 92 కిమీల దూరంలో భద్ర నది ఒడ్డున కలస ఉన్నది.
భద్ర నది ఒడ్డున ఉన్న పంచక్షేత్రాలలో (ఐదు సరస్సులు) ఇది ఒకటి. దగ్గరలో
ఉన్న చిన్న కొండ పై హొయసల శైలితో నిర్మితమైన శివాల యం కాళేశ్వర దేవాలయం
ఉన్నది. కలసలో ఉన్న పెద్ద శిలను మధ్వాచార్య బండ అని పిలుస్తారు. ఈ బండ పై
మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధిం చాడని చెబుతారు. ఈ శిల పై ఇప్పుడు
మధ్వచార్యుల విగ్రహం చెక్కబడింది.
కుద్రేముఖ్... జిల్లా రాజధాని చిక్మగళూరు కి 95 కిమీల నైఋతి దిశలో
ఉన్నది. కన్నడ భాషలో కుద్రేముఖ్ అంటే గుర్రపు ముఖం అని అర్థం. ఈ
పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్ అని పిలుస్తారు.
ఈ కుద్రేముఖ్ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవ నం ఉన్నది.
అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వతశ్రేణుల పరంపర లోతై న లోయలు, ఎత్తైన
శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టా నికి 1,894.3 కిమీ ఎత్తులో
ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్లో అపారమైన ఇనుప గనులు
ఉన్నాయి.కుద్రేముఖ్లో ఉన్న కుద్రేముఖ్ ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా
శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణం బూర్ నౌకాశ్రయానికి సరఫరా
చేయబడుతుంది.
ముల్లయనగిరి బాబు బుడాన్ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్ మగళూరు పట్టణానికి
16 కిమీ దూరంలో ఉన్నది. సముద్రమట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ
పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోనే ఎతె్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వతశిఖరం
సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ధి. చిక్మగళూరు నుండి సితలయనగిరి
వెళ్ళే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి
మట్టం ఏ సమయం లోనైనా ఒకేలాగ ఉంటుంది. అక్కడ నుండి ముల్లయనగిరికి
వెళ్ళేరహదారి చాలా సన్నగా ఉండి రెండు ప్రక్కల వాహనాలు పోవడానికి వీలు
లేకుండా ఉం టుంది. ముల్లయనగిరి కొండ చాలా వాలుగా ఉండడం వల్ల పైకి పూర్తిగా
వాహనాల మీద చేరుకోలేరు. ముల్లయనగిరి కొండకు ఎక్కే మధ్య భాగంలో ఒక చిన్న
గుడి కూడా ఉన్నది. ముల్లయన గిరి కొండల నుండి ఆకాశం నిర్మ లంగా ఉన్న రోజులలో
అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వత శ్రేణులను అధిరోహించాలని ఆసక్తి
ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం.
ఈ జలపాతం బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గరలో ఉన్నది. ఈ జలపాతం
పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత
అనందాన్ని కలిగిస్తుంటుంది.
బాబా బుడాన్ కొండల మధ్య చిక్మగళూరు పట్టణానికి 55 కిమీ దూరంలో
కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉన్నది. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్
రాజు కృష్ణరాజ వాడేయార్ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను
కె.ఆర్. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్రమట్టానికి
1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో
హరితంగా ఉంటుంది. పూలతోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం
వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపేవారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక
మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని
తిలకించ వలసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి. పర్వతం
నడిబొడ్డు నుండి పది నిమిషాల నడకలో వచ్చే జెడ్-పాయింట్ నుండి చూస్తే
రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డ భూములు కనిపిస్తాయి.
Share to other apps