రసగుల్ల


 
కావల్సినవి: 
పాలు     - అరలీటరు 
మైదా పిండి    - రెండు చెంచాలు
నిమ్మరసం     -  రెండుమూడు చెంచాలు
పంచదార     -  కప్పు
నీళ్లు     - కప్పు
యాలకుల పొడి - ఆరచెంచా

ఇలా చేయాలి:
రసగుల్లా తయారుచేయడానికి ముందు మందపాటి అడుగున్న పాత్రలో పాటు తీసుకునిన బాగా మరిగించాలి.పొయ్యి మీద నుంచి దింపి నిమ్మరసం కలపాలి. ఆ మిశ్రమాన్ని వస్త్రంలోకి తీసుకుని నీళ్లు గట్టిగా పిండేసి మూటలా కట్టి పైన బరువుంచాలి. రెండుమూడు గంటలకు నీళ్లన్నీ పోయి..మెత్తని పిండిలా తయారవుతుంది.దీన్ని చెన్నా అంటారు, అందులో మైదా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి, ఇప్పుడు నీళ్లలో పంచదార వేసి పొయ్యి మీద పెట్టాలి. పంచదార కరిగాక చెన్నా ఉండలను అందులో వేసి మూత పెట్టాలి.పదిహేను నిముషాల తరువాత దించి యాలకుల పొడి చల్లి ఫ్రిజ్‌లో ఉంచాలి.నోరూరించే రసమైన గుల్లా ..రసగుల్లా రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top