ఆసనాలతో పోలిస్తే..తేలికగా ఉండే ముద్రలతో శారీరక,మానసిక సమస్యల నుంచి
తేలిగా బయటపడవచ్చు. రోజులో నిర్ణీత సమయాన్ని ఈ ముద్రలకు కేటాయించడం వల్ల
చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని అంటున్నారు యోగా నిపుణలు.
సాధన చేసే విధానం..
ఈ ముద్రని కీళ్ల నోప్పులు,పక్షవాతం, రుమాటిజం, చేతులు కాళ్లు , తల వణికే
వారు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సుఖాసనంలో కూర్చుని..చూపుడు వేలు
చివర బొటనవేలు తగిలేట్టుగా ఈ ముద్రని ధరించాలి. తక్కిన మూడు వేళ్లను కాస్త
వదులుగా, నిటారుగా ఉంచాలి. బొటనవేలితో చూపుడు వేలుకు కొంచెం ఒత్తిడి
కలిగించాలి. రోజుకు పావుగంట పాటు ఈ ముధ్రవేయాలి. ఆయుర్వేదం ప్రకారం సుమారు
51 వాయువులు దేహంలో ఉంటాయి. వాటిలో అసమతుల్యం ఏర్పడినప్పుడు ఆనారోగ్యాలు
వస్తాయి. ఇది చేయడం వల్ల పైన పేర్కోన్న సమస్యలకి ఉపశమనం కలుగుతుంది.
దీర్ఘకాలిక వ్యాధులకైతే మరికొంత కాలం పడుతుంది. ఆరోగ్యం చేకూరిన తర్వాత ఈ
ముద్ర వేయాల్సిన అవసరం ఉండదు.