సూర్యచంద్రులతో భూమికి గల సంబంధాన్ని బట్టే కాలగణన జరుగుతుంది. అంతటి ప్రాశస్త్యం కల సూర్యచంద్రులకు గ్రహణం పట్టిందంటే అది దుర్దినమే కదా. మనకు వెలుగు, వేడి, చల్లదనాన్ని ప్రసాదించే సూర్యచంద్రులను క్రూరగ్రహాలైన రాహుకేతువులు మింగడమంటే అది లోకానికంతటికీ కష్టకాలం కదా! కాబట్టే గ్రహణం పట్టినంతసేపూ ఆలయాలను మూసి వేసి, గ్రహణం విడిచాక శుద్ధి చేసి ఆలయాలను తెరిచి భక్తులకు తిరిగి ఆలయప్రవేశం కల్పిస్తారు.