దంతాలు తెల్లగా మెరవాలన్నా, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా ......

దంతాలు తెల్లగా మెరవాలన్నా, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని పళ్లు తింటే సరిపోతుంది. పళ్లను శుభ్రంగా ఉంచే ఆ పండ్ల వివరాలే ఇవి.... ఊ అరటిపండులో ఉండే పీచు పదార్ధం పంటిమీద అతుక్కుపోయిన ఆహారాన్ని తొలగించడంలో బాగా పనిచేస్తుంది. దంతాల్ని తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఊ యాపిల్ తింటే చిగుళ్లపై ఉన్న గార తొలగిపోతుంది.

 కమలా, బత్తాయి వంటి ఫలాల్లో ఉండే సిట్రిక్ ఆమ్లం నోటిలో ఆమ్ల మోతాదు ఎక్కువ తక్కువ కాకుండా సరిచేస్తుంది. అలాగే మన శరీరంలోనే తయారయ్యే మౌత్‌వాష్... లాలాజలాన్ని వృద్ధి చేస్తుంది కూడా.



 వేసవిలో విటమిన్-సిని మెండుగా అందించేవి పుచ్చకాయలు. పుచ్చకాయను తింటే దంతాలు, చిగుళ్లపైన నెమ్మదిగా బ్రష్ చేసినట్టే అవుతుంది. ఊ స్ట్రాబెర్రీల్లో ఉండే మాలిక్ ఆమ్లం పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. అందుకోసం మీరేం చేయాలంటే... ఒక స్ట్రాబెర్రీ తీసుకుని మెత్తగా చేసి అందులో కాస్త బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్ల మీద రాసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేస్తే పళ్లు శుభ్రమవడమే కాకుండా మెరుస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top