మనకు క్యాల్షియమ్ అధికంగా ఉన్న పదార్థం అంటే మొదట గుర్తుకు వచ్చేవి పాలే. క్యాల్షియమ్ అన్నది మన ఎముకలు, పళ్ల బలానికి చాలా అవసరమైన పోషకం. అయితే మన దేశవాసుల్లో 45 శాతం మందికి క్యాల్షియమ్ లోపం ఉంది. దీన్ని అధిగమించడానికి పాలు తాగడం మంచిదే. అయితే క్యాల్షియమ్ ఎక్కువగా దొరకాలనే ఉద్దేశంతో మితిమీరి పాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్లగుణం పెరిగి శరీరానికి అందాల్సిన క్యాల్షియమ్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే రోజూ 300 ఎం.ఎల్. పాలను తీసుకుంటూ... వాటితో పాటు బాదంపప్పు, గుడ్లు, ఆకుకూరలు, చేపలు తినడం మంచిది.