చెయ్యాల్సిందంతా చేసేశాను, ఇంక ఎన్ననుకున్నా ఏమీ లాభం లేదు అని చెప్పాల్సిన సందర్భంలో ఈ సామెత వాడుతారు. గురజాడ అప్పారావు తన రచనల్లో రాసిన ఎన్నో పదాలు నానుడులుగా, సామెతలుగా చలామణీ అయ్యాయి. అటువంటి వాటిలో అగ్రశ్రేణికి చెందింది కన్యాశుల్కం నాటకంలోని ఈ వాక్యం. అగ్నిహోత్రావధాన్లు అనే పాత్ర, కన్యాశుల్కం మీది పేరాశతో భార్య ఇష్టానికి వ్యతిరేకంగా తమ కూతురికి ఒక ముసలివాడితో పెళ్లి నిశ్చయిస్తాడు.
దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్తారు. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’ అంటాడు. తాంబూలాలివ్వడమంటే పెళ్లి నిశ్చయం చేసుకోవడం. ఇంకా చె ప్పాలంటే, తాంబూలాలు తీసుకుంటే పెళ్లి దాదాపు జరిగినట్లే. అందుకే, నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను. ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదన్న ఉద్దేశంతో అతడలా అంటాడు. అదే తర్వాత సామెతలా స్థిరపడింది.
దానికి భార్య, బావమరిది అభ్యంతరం చెప్తారు. ఆ సందర్భంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’ అంటాడు. తాంబూలాలివ్వడమంటే పెళ్లి నిశ్చయం చేసుకోవడం. ఇంకా చె ప్పాలంటే, తాంబూలాలు తీసుకుంటే పెళ్లి దాదాపు జరిగినట్లే. అందుకే, నేను తాంబూలాలు కూడా ఇచ్చేశాను. ఇక మీరెంత గింజుకున్నా ఒరిగేదేమీ లేదన్న ఉద్దేశంతో అతడలా అంటాడు. అదే తర్వాత సామెతలా స్థిరపడింది.