డయాబెటిస్ రోగులు కాకర రసం తీసుకుంటే మంచిదని అందరికీ తెలిసిందే. అయితే మొదటిరోజే గ్లాసుడు రసం తాగేస్తే వెంటనే విరేచనాలు అవుతాయి. దానికి కారణం శరీరం చేదుకు అలవాటు పడి ఉండకపోవడమే. అందుకే ఒక్కో స్పూను రసం చొప్పున క్రమంగా పరిమాణాన్ని పెంచుకుంటూ పోవాలి. అలా చేస్తే కాకరకాయ రసంతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. మాత్రల అవసరం తగ్గిపోయి ఈ సహజ విధానంతోనే మధుమేహం కంట్రోల్లోకి వస్తుంది.