రోజు మూడుసార్లు బ్రష్ చేస్తే..

శుభ్రంగా పళ్లు తోముకోవటం వల్ల మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగటంతోపాటు మతిమరుపు దూరమవుతుందని తాజాగా కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనలో తేలింది. రోజుకు ఒకసారి పళ్లు తోముకునే వారికంటే రోజుకు మూడుసార్లు పళ్లు తోముకున్న వారిలో మతిమరుపు సమస్య లేదని తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. పళ్లు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఏర్పడే బాక్టీరియా వల్ల మెదడు దెబ్బతిని జ్ఞాపకశక్తి కోల్పోతారని వారు తేల్చారు. పళ్లు శుభ్రంగా తోముకోవటం వల్ల ఏర్పడే ఓరల్ హైజీన్‌తో మతిమరుపు ముప్పు తగ్గించవచ్చని అధ్యయనంలో తేలింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top