జీవనశైలి మార్పుతోపాటు కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవటం వల్ల మధుమేహం రాకుండా నివారించుకోవచ్చని అంటున్నారు అమెరికన్ డయాబెట్స్ అసోసియేషన్ ప్రతినిధులు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయం పెరగకుండా ఉండటంతోపాటు బ్లడ్షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. పీచు పదార్థాలు అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, బీన్స్, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మధుమేహం ముప్పును దూరంగా ఉంచవచ్చని వారు సెలవిస్తున్నారు.