గృహప్రవేశ సమయంలోపాలెందుకు పొంగిస్తారు?

ఆదిపరాశక్తి ఈ జగత్తును సృష్టించాలనే సంకల్పంతో బ్రహ్మకు సృష్టికార్యాన్ని, విష్ణువుకు స్థితి కార్యాన్ని, శివునికి లయకార్యాన్ని అప్పగించింది. అయితే సృష్టి అంతట్లోకీ ఉత్తమమైనది మానవజన్మ. అలాంటి మానవులకు మేధస్సు, తేజస్సు, పుష్టి, పరిపుష్టిని కలిగించేందుకు గాను సాక్షాత్తూ ఆదిపరాశక్తి గోమాత రూపంలో భువికి దిగి వచ్చింది. అందుకే గోమాతను నిత్యం పూజించాలి. గోవు నుంచి వచ్చే పేడ, మూత్రం, పాలు అన్నీ పవిత్రమే. ముఖ్యంగా స్వచ్ఛమైన పాలు పొంగి పొర్లిన ఇంట్లో, అష్టయిశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ వెల్లివిరుస్తాయి. అందుకే కొత్త ఇంట్లోకి వెళ్లేప్పుడు తప్పకుండా పాలు పొంగిస్తారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top